మాదాపూర్, వెలుగు: భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాకుండా, మంచి వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హైడ్రా తీసుకువచ్చి చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంపై సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మాదాపూర్లోని తమ్మిడి కుంట చెరువు వద్ద మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు.
టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నీటి వనరుల రక్షణపై స్టూడెంట్స్తో ప్రతిజ్ఞ చేశారు.
