ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనతో పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ కు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ క్షమాపణ చెప్పారు. ఇవాళ హిమాయత్ నగర్ డివిజన్ కు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబి కండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యకర్తల ద్వారానే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికి అందుతాయని దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఏర్పడిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించలేదని.. నష్టాలపై గవర్నర్ స్పష్టమైన నివేదిక సమర్పించి, పరిహారం ప్రకటించేలా వ్యవహరించాలని దానం నాగేందర్ కోరారు.