
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రజలకు లబ్ధిచేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం కన్నెపల్లి మండలంలోని ఎల్లారంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు సుర్జాపూర్లో బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జన్కాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎల్లారం గ్రామానికి వేసిన బీటీ రోడ్డును ప్రారంభించారు.
కన్నెపల్లి, భీమిని మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బెల్లంప్లలి మార్కెట్కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, భీమిని, కన్నెపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, మాజీ జడ్పీటీసీ అల్లి మోహన్, నాయకులు జలపతి, రోహిత్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన మాజీ జడ్పీటీసీ
కన్నెపల్లి మండల మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ మంగళవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే వినోద్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు సత్యనారాయణ చెప్పారు.