పాత పనులు ఆపుతారా? మిమ్మల్ని ట్రాన్స్​ఫర్ ​చేయిస్తా : గొంగిడి సునీత

పాత పనులు ఆపుతారా?  మిమ్మల్ని ట్రాన్స్​ఫర్ ​చేయిస్తా : గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆఫీసర్లపై సీరియస్​అయ్యారు. ఎన్నికల షెడ్యూల్​ రాకముందే శంకుస్థాపన చేసిన పనులను ఆపడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేసి బదిలీ చేయిస్తానని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్​(ఎం) మండలం కూరెళ్లలో కల్లూరి రాంచంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్​3న శంకుస్థాపన చేసిన పనులను నిర్వహించకుండా ఆఫీసర్లు ఆపుతున్నారని పలువురు బీఆర్ఎస్​ లీడర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

కాంగ్రెస్​ లీడర్లు కంప్లయింట్​చేయడం వల్లే ఆఫీసర్లు ఆపుతున్నారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆఫీసర్లను ఉద్దేశించి పై విధంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్​అక్టోబర్​9న వచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్నారు. లేకపోతే తానే కంప్లయింట్​ఇచ్చి బదిలీ చేయించి పనులు చేయిస్తానని స్పష్టం చేశారు.