సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

సమాజ సేవలో  కుల సంఘాల పాత్ర మరింత బలపడాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్, వెలుగు: సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి అన్నారు. అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని బీరంగూడ గుట్టపై వీరశైవ లింగాయత్​ సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పటాన్​చెరు నియోజకవర్గంలో వీరశైవుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.30లక్షల సొంత నిధులతో బీరంగూడ కమాన్​ వద్ద మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనే వీరశైవులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం చిన్నారులు పలు  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుధాకర్​రెడ్డి, మున్సిపల్​మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​ విజయ్​కుమార్​, వీరశైవ లింగాయత్​ జిల్లా అధ్యక్షుడు నర్సింలు, నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్, నాయకులు రుశ్వంత్​రెడ్డి, రామచంద్రారెడ్డి, లింగాయత్​ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.