- బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే గవర్నర్ నడుస్తున్నరు
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే గవర్నర్ నడుచుకుంటున్నారని, బీజేపీ పాలన కావాలనుకునే వాళ్లే గవర్నర్ పాలన కోరుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి రానీయకుండా ఆడుతున్న నాటకంలో ఆమె కూడా భాగమేనన్నారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు. గవర్నర్ దర్బార్లు పెడితే ఏం ప్రయోజనం లేదని, ఆమె తనకు జరిగిన అవమానంపైనే ఇంత వరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఆమె అధికారులను రాజ్భవన్కు పిలిపించుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటి వ్యక్తికి సమస్యలు చెప్పుకొని లాభమేందని ప్రశ్నించారు.