బీజేపీ స్క్రిప్ట్​ ప్రకారమే  గవర్నర్​ నడుస్తున్నరు

బీజేపీ స్క్రిప్ట్​ ప్రకారమే  గవర్నర్​ నడుస్తున్నరు
  • బీజేపీ స్క్రిప్ట్​ ప్రకారమే  గవర్నర్​ నడుస్తున్నరు
  • పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్క్రిప్ట్​ ప్రకారమే గవర్నర్​ నడుచుకుంటున్నారని, బీజేపీ పాలన కావాలనుకునే వాళ్లే గవర్నర్​ పాలన కోరుతారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్​ను అధికారంలోకి రానీయకుండా ఆడుతున్న నాటకంలో ఆమె కూడా భాగమేనన్నారు. శుక్రవారం గాంధీభవన్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. గవర్నర్​ దర్బార్​లు పెడితే ఏం ప్రయోజనం లేదని, ఆమె తనకు జరిగిన అవమానంపైనే ఇంత వరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఆమె అధికారులను రాజ్​భవన్​కు పిలిపించుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటి వ్యక్తికి సమస్యలు చెప్పుకొని లాభమేందని ప్రశ్నించారు.