
స్టేషన్ఘన్పూర్(జఫర్గఢ్), వెలుగు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా జఫర్గఢ్ తహసీల్దార్ ఆఫీస్లో బుధవారం ఆయన కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్తో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు కడుపునిండా అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మొక్కలు నాటారు. అంతకుముందు మండల పరిధిలోని కూనూరులో రూ.2.5 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, తిడుగు గ్రామంలో రూ.35లక్షల ఈజీఎస్నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, ఓపెన్జిమ్ను ఎమ్మెల్యే కడియం ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ రోహిత్సింగ్, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యాశిరీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.