
స్టేషన్ఘన్పూర్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తోందని, వాటిని పేదలకు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ పట్టణంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు.
ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్త అనే తారతమ్యాలు లేకుండా, మనందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. జులై4న హైదరాబాద్లో జరుగనున్న సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.