- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లెందు అని, దీని అభివృద్ధికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు సూచించారు. సోమవారం సింగరేణి భవన్లో సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్లాంట్ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి మెయిన్ హాస్పిటల్లో గుండె రోగులకు క్యాథ్ లాగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కొత్త బొగ్గు బాయిలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్తగూడెం బస్టాండ్ నిర్మాణానికి యాజమాన్యం సహకరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎండీకి అందజేశారు.
