అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్పరిధిలోని వడక్పల్లి పరిధిలో రూ.2.70 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. బొమ్మనకుంటలో రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, వడక్పల్లిలో రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన అంతర్గత రవాణా సౌకర్యం కల్పించేందుకు హైలెవల్ బ్రిడ్జి, కల్వర్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఇంజనీరింగ్ డీఈ వెంకటరమణ, పంచాయతీ రాజ్ డీఈ సురేశ్, నాయకులు మల్లేశ్, పాండు, భాస్కర్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, రామిరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
