సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మాణిక్రావు

సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మాణిక్రావు

ఝరాసంగం, వెలుగు:  ప్రభుత్వం నాఫెడ్​ అధ్వర్యంలో మార్క్​ఫెడ్​ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్​రావు, ఉమ్మడి మెదక్​ జిల్లా డీసీఎంఎస్​ చైర్మన్​ మల్కాపురం శివకుమార్​ సూచించారు. శనివారం మండల పరిధిలోని ఏడాకులపల్లి పీఏసీఎస్​ సెంటర్​లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

వారు మాట్లాడుతూ సోయాబీన్​ పంటకు ప్రభుత్వం క్వింటాల్​కు రూ.5328 చెల్లిస్తోందని రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే  పంటను విక్రయించి లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో  పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ కాంతమ్మ,  డైరెక్టర్లు అనంత్​రామ్​గౌడ్​,  శ్రీనివాస్, రాంచందర్​, ఆలయ కమిటీ మాజీ చైర్మన్​ నర్సింహాగౌడ్, ఏఓ వెంకటేశం, ఏఈఓ వేదా,  సొసైటీ సీఈఓ శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.