వర్షాకాలంలో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి : పాయం వెంకటేశ్వర్లు

 వర్షాకాలంలో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి : పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, వెలుగు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శానిటేషన్ డ్రైవ్ పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం గ్రామాల్లో శుభ్రతను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను అమలు చేసి చెత్త తొలగింపు, వ్యర్థాల నిర్వహణపై చర్యలు చేపట్టాలన్నారు. మురుగు కాలువలు నీట్​గా ఉంచి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. 

రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, హాస్పిటళ్ల ఆవరణల్లో పిచ్చి మొక్కలు తొలగించి బ్లీచింగ్ చల్లాలన్నారు. పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించి మహిళా సంఘాలు, యువజన సంఘాలు, పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యంతో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో వెంకటేశ్వరరావు తోపాటు గ్రామపంచాయతీ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.