యూపీఏలో ఉండే వాళ్లంతా దేశద్రోహులే : రఘనందన్ రావు

యూపీఏలో  ఉండే వాళ్లంతా దేశద్రోహులే : రఘనందన్ రావు

యూపీఏ పార్టీల సమూహంలో ఉండే వాళ్లంతా దేశద్రోహులేనని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు.  యూపీఏకు పేరు బదులు ఇండియా అనే పేరు పెట్టుకుని ముందుకు వస్తున్నారని, ఇండియా అని పేరు పెట్టుకున్న..  ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్న మళ్లీ గెలిచేది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.  

భారత్ వర్సెస్ ఇండియా అనే రీతిలో 2024 ఎన్నికలు జరుగుతాయని,  అందులో గెలిచేది భారతేనన్నారు రఘనందన్ . వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 400సీట్లతో అధికారంలోకి వస్తు్ందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో హిందువులపై దాడి జరగడం సిగ్గుచేటన్నారు రఘునందన్.  హిందూ ముస్లిం గొడవలో గాయాల పాలైన వారిని పరామర్శించడానికి వెళ్తున్న తనని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ హల్లర్లలో అలసట వహించిన పోలీసు అధికారుల పైన తక్షణమే సస్పెండ్ చేయాలని రఘనందన్ డిమాండ్ చేశారు.