హామీల అమలుపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి

హామీల అమలుపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ప్రజల గోస.. బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన  బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల గోస.. బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.