వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్​

వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా సోషల్​ మీడియా కో ఆర్డినేటర్లు పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో పార్లమెంట్​ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో చీఫ్​ క్లస్టర్లు, ప్రత్యేక ఆహ్వానితులు, జోనల్​ క్లస్టర్లు, డివిజన్​ అధ్యక్షులు, డివిజన్​ సోషల్​ మీడియా కో ఆర్డినేటర్లు, సోషల్​ మీడియా క్లస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఏ విధంగా పనిచేశారో అంతకుమించి పనిచేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.