నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రూ.235 కోట్లతో ఆసుపత్రి డెవలప్మెంట్ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో 650 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు.
నాగనూలు చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్లతో పనులు ప్రారంభించారు. పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తాడూరు మండలం బలాన్ పల్లి గ్రామంలో రథసప్తమి సందర్భంగా ఒంగోలు జాతి పశువుల పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డి గ్రామానికి చెందిన 40 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.
