
- సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎంకు ధన్యవాదాలు
- ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్హామీ ఏమైందని ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రశ్నించారు. శుక్రవారం బైంసాలోని బృందావన్ గార్డెన్లో బైంసా పట్టణం, మండలానికి చెందిన 159 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ చెక్కులు రావాలంటే ఏళ్లు పట్టేదని, ప్రస్తుతం 18 నెలల కాలంలో ఐదుసార్లు అందజేశామని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేక్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మారెడ్డి పాల్గొన్నారు.