
మెదక్ టౌన్, వెలుగు: మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి రెండు మున్సిపాలిటీల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లతో సమీక్షించి వార్డుల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్లు, డీఈలతో కలిసి పట్టణ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. సమావేశంలో హవేలీ ఘనపూర్ తహసీల్దార్ సింధురేణుక, మెదక్, రామాయంపేట మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, డీఈలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.