మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్​రావు హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్​కలెక్టరేట్​లో కలెక్టర్ రాహుల్ రాజ్​తో కలిసి రెండు మున్సిపాలిటీల​ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్​ కౌన్సిలర్లతో సమీక్షించి వార్డుల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్లు, డీఈలతో కలిసి  పట్టణ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. సమావేశంలో హవేలీ ఘనపూర్​ తహసీల్దార్​ సింధురేణుక, మెదక్​, రామాయంపేట మున్సిపల్​ కమిషనర్లు శ్రీనివాస్​ రెడ్డి, డీఈలు, మున్సిపల్​ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.