మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్యే శ్రీగణేశ్ భేటీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహాలపై చర్చ

మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్యే శ్రీగణేశ్ భేటీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహాలపై చర్చ

పద్మారావునగర్: అధిష్ఠానం పిలుపు మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్​చార్జీ సెక్రటరీలు విశ్వనాథన్, సచిన్ సావంత్​ను కలిశారు. హైదరాబాద్​లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం వ్యూహాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

వికారాబాద్ నేతలతోనూ చర్చలు

వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్​రెడ్డి, వికారాబాద్​పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్​రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్​తో గురువారం​వేర్వేరుగా​భేటీ అయ్యారు. ఇటీవల వికారాబాద్​జిల్లా కాంగ్రెస్​అధ్యక్ష పదవికి వీరు పోటీ పడగా, అధిష్ఠానం ధారాసింగ్​ను నియమించింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న ఇరువురు నాయకులతో ఆమె మాట్లాడారు. వికారాబాద్​జిల్లా రాజకీయాలపై చర్చించారు.