పిట్లం, వెలుగు : ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుందలో సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయాలన్నారు.
ఎలాంటి అవసరమున్నా సహకరిస్తానన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ గ్రామాలకు సర్పంచ్లు గ్రామ పాలనకు వెన్నుముకలని, వారి సారధ్యంలో గ్రామాలు అభివృద్ధి సాధించాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
