వనపర్తిలో 18 నెలల్లో రూ. 49 కోట్ల చెక్కులిచ్చాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తిలో 18 నెలల్లో రూ. 49 కోట్ల చెక్కులిచ్చాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల కాలంలో వనపర్తిలో 49.33 కోట్ల విలువ జేసే సీఎంఆర్​ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులిచ్చామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 204 మంది లబ్ధిదారులకు రూ.2,04,23,664 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇప్పటి వరకు  230 మందికి రూ. 4 కోట్ల విలువజేసే ఎల్​ఓసీలు ఇచ్చామని పేర్కొన్నారు.  

వనపర్తిలో రూ.10.33కోట్ల విలువ చేసే 4776  సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పది విడతలుగా రూ.39 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ కింద 3863 చెక్కులిచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయన్నారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​ శ్రీనివాస్​గౌడ్​, పార్టీ నాయకులు పాల్గొన్నారు.