
ఖానాపూర్, వెలుగు: పేదల సొంతింటి కల సాకారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని హీరాపూర్(జే) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ
ఆదిలాబాద్, వెలుగు: ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేర గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం భూమిపూజ చేశారు. జిల్లాకు రెండు విడతల్లో 7,010 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. గిన్నేరలో ఫేజ్– 2 కింద11 ఇండ్లు మంజూరవగా 9 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రవీణ్ తదితరులున్నారు.
ఇండ్ల పనులు వేగవంతం చేయాలి
నస్పూర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం కన్నెపల్లి మండలం టేకులపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇంటితోపాటు గొల్లగట్టు, కన్నెపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఇండ్ల పనులను తహసీల్దార్ శ్రవణ్కుమార్, ఎంపీడీవో శంకర్ తో కలిసి పరిశీలించారు. కన్నెపల్లి పీహెచ్సీ భవనం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, దరఖాస్తుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఎంపీడీవో ఆఫీస్కు వెళ్లి, అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
తేజాపూర్ గ్రామంలో..
నేరడిగొండ, వెలుగు: తేజాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ యూత్ బోథ్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, ఎంపీడీవో రాజ్ వీర్ శుక్రవారం భూమిపూజ చేశారు. హౌసింగ్ ఏఈ గణేశ్, పంచాయతీ సెక్రటరీ రాజు రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .