2028లో నేనే సీఎం, రాష్ట్రంలో బీజేపీదే అధికారం: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

2028లో నేనే సీఎం, రాష్ట్రంలో బీజేపీదే అధికారం: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

హైదరాబాద్​:  ‘2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, అప్పుడు నేనే సీఎం’ అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. తన జోలికొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని హెచ్చరించారు.  కాంగ్రెస్,  బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని కల్పించలేదని మండిపడ్డారు. దోమకొండలో వంద పడకల ఆస్పత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలపై గెలిచిన తనను ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.