బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మెట్పల్లి గ్రామంలో పొలాల అమావాస్య వేడుకల్లో భాగంగా నేతకాని మహిళలు నిర్వహించిన గురుగుల నిమజ్జన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు. వేడుకల్లో మహిళలు నృత్యాలతో సందడి చేయగా.. ఎమ్మెల్యే వారితో కలిసి డ్యాన్సులు చేస్తూ జోష్ పెంచారు.
