మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు వివేక్ వెంకటస్వామి . మంచిర్యాలతో పాటు మందమర్రి,పులమడుగు ఆలయాల్లో సీతారాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.