ప్రజలంతా సంతోషంగా ఉండాలి : వివేక్​ వెంకటస్వామి

ప్రజలంతా సంతోషంగా ఉండాలి : వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి  ఆయన సతీమణీ గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ  శుక్రవారం ఓదెల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వివేక్​ దంపతులకు, వారి కుమారుడు వంశీకృష్ణను  ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా దేవాలయంలోకి ఆహ్వానించారు.

అనంతరం వివేక్​ కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వివేక్​ను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వివేక్​ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్​ మల్లేశం యాదవ్‌‌‌‌‌‌‌‌  తదితరులు పాల్గొన్నారు. 

సీఎం దృష్టికి ఉద్యమకారుల సమస్యల్ని తీసుకెళ్త

పెద్దపల్లి, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల సమస్యను సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి అన్నారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు వివేక్‌‌‌‌‌‌‌‌కు వినతి పత్రం ఇచ్చారు.  అనంతరం ఎమ్మెల్యే వివేక్​ మాట్లాడుతూ..  

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలు తనకు తెలుసన్నారు. తాను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని ఉద్యమకారుడిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్​,  అల్లం సతీశ్‌‌‌‌‌‌‌‌, వీరవేన శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గడ్డం బన్ని, , ఎర్రయ్య, సురేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులున్నారు.