
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని, ప్రైవేట్కు ధీటుగా మార్చాలని గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని డైట్ కాలేజీలో ఉపాధ్యాయ శిక్షణ తరగతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వసతుల గురించి పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.
పీఆర్సీ పెండింగ్, డీఏలు, జీపీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, ఏఏంవో సుదర్శనమూర్తి, కో-ఆర్డినేటర్ గంగయ్య, నాగుల్ మీరా, శ్రీనివాస్, తపస్జిల్లా నాయకులు పాల్గొన్నారు.