పంటలతో పాలమూరు కళకళలాడుతోంది : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

పంటలతో పాలమూరు కళకళలాడుతోంది : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాలమూరు జిల్లా పంటలతో కళకళలాడుతోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్  తెలిపారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ చైతన్య రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్  జక్క రఘునందన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా గద్దర్  ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా  దేశపతి మాట్లాడుతూ కేఎల్ఐ ప్రాజెక్టుతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. డిగ్రీ కాలేజీ కూడా లేని నాగర్ కర్నూల్ కు నేడు మెడికల్  కాలేజీ వచ్చిందన్నారు. బూత్​ కమిటీ సభ్యులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఎంజెర్  ట్రస్ట్  డైరెక్టర్  జమున, బీఆర్ఎస్  రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్  పాల్గొన్నారు.