యువకుడి మృతదేహానికి రీపోస్టుమార్టం..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసినట్లు అనుమానం

యువకుడి మృతదేహానికి రీపోస్టుమార్టం..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసినట్లు అనుమానం
  •  నారాయణపేట జిల్లాలో ఘటన

మరికల్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన ఓ యువకుడి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మరికల్​కు చెందిన బోడి బాల్​రాజ్​కు మక్తల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు బుధవారం కుటుంబ సభ్యులకు ఫోన్​ వచ్చింది.

 దీంతో వారు ప్రమాద స్థలానికి వెళ్లగా బాల్​రాజ్​ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ఆయనను హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మక్తల్​ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించాక కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. 

గురువారం వారు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే కొందరు ఇన్సూరెన్స్​ ఏజెంట్లు బాల్​రాజ్​పై ప్రమాద బీమాలు చేయించి, ఆ డబ్బుల కోసమే చంపేశారని అనుమానిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మక్తల్​ సీఐ రాంలాల్​, మరికల్​ సీఐ భగవంత్​రెడ్డి శుక్రవారం మృతదేహన్ని బయటకు తీయించి రీపోస్టుమార్టంకు తరలించారు.