ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీకి  వెళ్లిన ఎమ్మెల్సీ  కవిత

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న ఉదయం ఢిల్లీకి వెళ్లారు. లిక్కర్​స్కామ్​లో విచారణ ఎదుర్కోవడానికి ముందు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టినట్టుగానే, రెండో విడత విచారణకు ముందు మరో రూపంలో ఆందోళనకు ప్లాన్ చేశారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్​ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్​హోటల్​లో రౌండ్​టేబుల్​సమావేశం ఏర్పాటు చేశారు. ఈ​ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. మార్చి 16న కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.