ఢిల్లీ వెళ్లే రైళ్లను ఆపేస్తం : ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ వెళ్లే రైళ్లను ఆపేస్తం : ఎమ్మెల్సీ కవిత
  • బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై 17న రైల్ రోకో: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్​తో ఢిల్లీకి వెళ్లే ప్రతి రైలునూ ఆపేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల17న నిర్వహించే రైల్ రోకోతో ఢిల్లీకి సెగ తగిలేలా చేస్తామని తెలిపారు. గురువారం హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని నివాసంలో రైల్​రోకో పోస్టర్​  ఆవిష్కరణ అనంతరం, ఆమె మాట్లాడారు.

 రైల్ రోకోకు బీఆర్​ఎస్​ నుంచి మద్దతు ఉంటుందన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో42% రిజర్వేషన్లపై కాంగ్రెస్​ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు నెలల తరబడి కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నా కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.