బీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదు

బీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదు

 ప్రజల కోసమే రాహుల్ గాంధీ యాత్ర 
ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ 

హైదరాబాద్: నెహ్రూ,రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణల వల్లనే ఇవాళ మనం సుఖంగా బతుకున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.  గాంధీ భవన్ లో 75వ ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో  కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య జనాలు మాత్రమే పాల్గొన్నారని,  మత బీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదని,  కానీ ఇప్పుడు తామే అన్ని తెచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు.  త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయని, జనాలు ఆలోచించుకుని ముందుకు వెళ్లాలన్నారు. దేశ ప్రజల కోసమే రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ వెంకట్, ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, వి. హనుమంతరావు, మల్లు రవి, మధు యాష్కీ, కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.