సీఎం కేసీఆర్​ దళితులను దగా చేసిండు

సీఎం కేసీఆర్​ దళితులను దగా చేసిండు
  • ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి

గంగాధర, వెలుగు : సీఎం కేసీఆర్​ తన తొమ్మిదేళ్ల పాలనలో దళితులను దగా చేశారని ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి ఆరోపించారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్​ కార్యకర్తలు పార్టీ ఆఫీస్‌‌ నుంచి చౌరస్తాకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జీవన్‌‌రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో దళితులకు కేటాయించిన రూ.40 వేల కోట్లు క్యారీ ఫార్వార్డ్ చేసి దళిత సమాజాన్ని కేసీఆర్ ​మోసం చేశారన్నారు.

ఫండ్స్ డైవర్ట్​ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ​ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సమక్షంలో సుమారు 80 మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యువ నాయకుడు వొడ్నాల యగ్నేశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.