సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్, డీఎంకె కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి అభ్యర్థి తరుపున ప్రచారం కూడా చేయనున్నట్లుగా కమల్ ప్రకటించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం ఉంటుదని తెలిపారు.
కూటమి అభ్యర్థిగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) మాజీ చీఫ్ ఎలంగోవన్ పోటీలో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికలలో తేని నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఈయన అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనాథ్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. కాగా ఫిబ్రవరి 27న ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 2 న ఫలితాలు వెలువడనున్నాయి.