ఫోన్​ పోయినా దొరుకుతది.. 17న కొత్త సిస్టమ్​ లాంచ్​​

ఫోన్​ పోయినా దొరుకుతది.. 17న కొత్త సిస్టమ్​ లాంచ్​​
  • 17న కొత్త సిస్టమ్​ లాంచ్​​
  • ప్రభుత్వాధికారి వెల్లడి
  • పైలట్​ కింద కర్నాటకలో 2,500 ఫోన్ల రికవరీ
  • ఐఎంఈఐ క్లోనింగ్​ ఇక కుదరదు

న్యూఢిల్లీ: మొబైల్​ ఫోన్లను పోగొట్టుకున్న వారు తమ ఫోన్లను ట్రాక్ లేదా బ్లాక్​ చేసుకునేందుకు కొత్త ట్రాకింగ్​ సిస్టమ్​ను ఈ నెల 17 న దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాంఛ్​ చేయనుంది. సెంటర్​ ఫర్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలిమాటిక్స్​ (సీడాట్​) ఈ కొత్త ట్రాకింగ్​ సిస్టమ్​ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్టర్​)​ను డెవలప్​ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, నార్త్​ ఈస్ట్​ టెలికం సర్కిల్స్​లో పైలట్​ ప్రాజెక్టులను అమలు చేశారు కూడా. దేశవ్యాప్తంగా సీఈఐఆర్​ సిస్టమ్​ను మే 17 న లాంఛ్​ చేయనున్నట్లు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికం సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. సీఈఐఆర్​ సిస్టమ్​ రెడీ అయిందని, అయితే లాంఛ్​ తేదీ గురించి తాను మాట్లాడలేనని సీడాట్​ సీఈఓ రాజ్​కుమార్​ ఉపాధ్యాయ చెప్పారు. ఈ క్వార్టర్లో దేశమంతటా సీఈఐఆర్​ సిస్టమ్​ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని అన్నారు. మొబైల్​ఫోన్లను పోగొట్టుకున్న వారు ఎవరైనా తమ ఫోన్లను ట్రాక్​ లేదా బ్లాక్​ చేసుకోవడానికి ఈ కొత్త సిస్టమ్​ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని టెలికం నెట్​వర్క్​లలోనూ క్లోన్డ్​ మొబైల్స్​ కనిపెట్టడానికి తగిన ఫీచర్స్​ను సీడాట్ యాడ్​ చేసింది. ఇండియాలో ఎవరైనా మొబైల్​ ఫోన్లను అమ్మాలంటే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్​ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది.  

ఎలా కనిపెడతారంటే....

అప్రూవల్​ పొందిన ఐఎంఈఐ నెంబర్ల లిస్టు మొబైల్​ నెట్​వర్కులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎలాంటి అన్​ ఆధరైజ్డ్​ మొబైల్​ ఫోన్​ తమ నెట్​వర్కులో ఎంటరయినా ఆపరేటర్లకు వెంటనే తెలిసిపోతుంది. టెలికం ఆపరేటర్లు, సీఈఐఆర్​ సిస్టమ్​లకు మొబైల్​ డివైస్​కి లింకయిన ​ ఐఎంఈఐ నెంబర్​ తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్​ సాయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురయిన మొబైల్​ ఫోన్లను సీఈఐఆర్​తో ట్రాక్​ చేస్తున్నారు. మొబైల్​ ఫోన్లను దొంగిలించిన దొంగలు చేసే మొదటి పని ఏమిటంటే, ఐఎంఈఐ నెంబర్​ను మార్చేయడం. దీంతో ఆ మొబైల్​ ఫోన్​ను ట్రాక్​ చేయడం లేదా బ్లాక్​ చేయడం కష్టతరంగా మారుతుంది.  ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్యేనని  రాజ్​కుమార్​ ఉపాధ్యాయ పేర్కొన్నారు. తమ వద్ద ఉండే డేటాబేస్​ల సాయంతో క్లోన్డ్​మొబైల్స్​ను కనిపెట్టి వాటిని సీఈఐఆర్​ సిస్టమ్​ బ్లాక్​ చేయగలుగుతుందని తెలిపారు. 

సీఈఐఆర్​ ఎందుకు....

పోయిన లేదా దొంగతనానికి గురయిన మొబైల్​ ఫోన్ల రిపోర్టింగ్​ను సులభం చేయాలనే ఉద్దేశంతో  సీఈఐఆర్​ను డెవలప్​ చేశారు. అంతేకాదు, దేశమంతటా అలాంటి మొబైల్​ ఫోన్ల వాడకాన్ని  బ్లాక్​ చేయాలనేది కూడా టార్గెట్టే.  ఈ కొత్త సిస్టమ్​ రాక వల్ల  మొబైల్​ ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని అంచనా. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురయిన మొబైల్​ ఫోన్లను ట్రాక్​చేయడమూ పోలీసులకు కొంత సులభమవుతుంది. 

కర్నాటకలో 2500 మొబైల్స్​ దొరికినయ్...

పైలట్​ అమలయిన కర్నాటక సర్కిల్​లో 2,500 మొబైల్​ఫోన్లను సీఈఐఆర్​ సిస్టమ్​ సాయంతో  పోలీసులు రికవరీ చేశారు. వాటిని తిరిగి ఆ మొబైల్​ ఫోన్ల యజమానులకు అప్పగించారు. యాపిల్​ ఐడీ సాయంతో పోయిన మొబైల్​ను ట్రాక్​ చేసే సదుపాయం యాపిల్​కు ఇప్పటికే ఉంది. కానీ, ఆండ్రాయిడ్​ మొబైల్​ ఫోన్లకే అలాంటి సదుపాయమేదీ లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది. కొత్త సిస్టమ్​ రాకతో ఒకవేళ ఎవరైనా మొబైల్​ ఫోన్​ దొంగిలించినా, దానిని ఇక మీదట వాడుకోవడం కుదరదు. ఫోన్ల స్మగ్లింగ్​ను కనిపెట్టడానికి కూడా తగిన మెకానిజం ఈ సీఈఐఆర్​ సిస్టమ్​లో ఉందని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పోకుండా కాపాడుకోవచ్చని ఉపాధ్యాయ వెల్లడించారు.