డెంగ్యూతో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మృతి

డెంగ్యూతో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మృతి

మోత్కూరు, వెలుగు: యాదాద్రి జిల్లా గుండాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. సురేష్ కుమార్ (54) డెంగ్యూతో మృతి చెందారు.  అతను వారం నుంచి జ్వరంతో బాధపడుతుండగా.. ఎంతకూ తగ్గకపోవడంతో రెండు రోజుల కిందట మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు డెంగ్యూ జ్వరంగా నిర్ధారించి చికిత్స చేస్తుండగా బాడీలో మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిని ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మృతి చెందారు.  

ఏపీలోని నూజివీడు చెందిన కుమార్ పదేండ్లుగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జనగామలో ఉంటున్నారు. ప్రిన్సిపాల్ మృతితో టీచర్లు, పలువురు నేతలు సంతాపం తెలిపారు.