నీళ్లు ఆదా చేద్దాం.. మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

నీళ్లు ఆదా చేద్దాం.. మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

నీటికున్న ప్రాధాన్యతను గుర్తించి జల్ శక్తి అనే పేరిట కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు ప్రధాని మోడీ. దీనిద్వారా నీటి సమస్యలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలమని అభిప్రాయపడ్డారు. ప్రధానిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ..ప్రతి ఏటా దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయన్నారు. దేశంలో కేవలం 8 శాతం వర్షపు నీటిని మాత్రమే ఒడిసిపట్టగలుగుతున్నా నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం చేసిన కేదార్ నాథ్ యాత్రను కొందరు రాజకీయం చేశారని మోడీ ఆరోపించారు.