ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్: మోడీ

ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్: మోడీ

భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని అన్నారు. పార్లమెంటులో నూతన సభ్యుడు ఎవరైనామాట్లాడాలనుకుంటే వారిని ప్రోత్సహిస్తుందన్నారు. దేశ ఆర్ధికమంత్రి కూడా మహిళ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని చెప్పారు. ‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’ అనే కాన్సెఫ్ట్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.