మోడీ అంటే ఇష్టమా.. రాహుల్కు పెద్ద ఫ్యానా.. అయితే మీ అభిమానాన్ని వెరైటీగా చూపించే చాన్సుంది. మోడీ చీరలు.. రాహుల్ చొక్కాలు వేసుకుని మీ ఫేవరెట్ లీడర్ కు సపోర్ట్ చేయవచ్చు. ప్రస్తుతం వీరి ఫొటోలతో కూడిన చీరలు, చొక్కాలు, కుర్తాలు, జాకెట్స్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ప్రియాంక, మమత, మాయావతి బొమ్మలతో చీరలూ మార్కెట్లోకి వచ్చాయి. ఎన్ని ఉన్నా మోడీ చీరలు, టీషర్ట్స్హాట్ కేకులుగా మారాయి. గతంలోనూ ఈ ట్రెండ్ ఉన్నా.. ఇప్పుడది పీక్కు చేరింది. 2014లో ప్రధాని మోడీ డిజిటల్ ఫొటోలతో శారీ ప్రింటింగ్ మొదలైంది. మోడీకి మద్దతుగా సూరత్ శారీ మాన్యుఫ్యాక్చర్ ఈ శారీలను డిజైన్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా చొక్కాలు, టీషర్ట్స్ వరకూ పాకింది. అయితే ఈ ఎలక్షన్ టైమ్లోనే వీటికి క్రేజ్ పెరిగింది. మోడీ శారీలు, డ్రెస్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మిగతా నాయకుల బొమ్మలతోనూ ప్రింటింగ్ మొదలైంది. అయితే మోడీని బీట్ చేయడం మాత్రం ఎవరి వల్లా కాలేదు. నిన్న మొన్నటి వరకూ ఆఫ్ లైన్ అమ్మకాలకే పరిమితమైన ఈ బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్ లోనూ జోరుగా సాగుతోంది. మోడల్స్ వెరైటీ వెరైటీ డ్రెస్సులు, శారీలు, షర్ట్స్ వేసుకుని జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. తమకు ఇష్టమైన పొలిటికల్ పార్టీని బట్టి జనం డ్రెస్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ పోర్టళ్లలో మోడీ డిజిటల్ ఫొటోతో ఉన్న శారీల రేట్లు రూ.1,000 నుంచి రూ.3,500 వరకూ ఉన్నాయి. సూరత్లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ పాకింది. మోడీతో పాటు రాహుల్, ప్రియాంక, మమత ఫొటోలతోనూ పార్టీ సింబల్స్తోనూ చీరలు, చొక్కాల ప్రింటింగ్ జరుగుతోంది.
