యాదాద్రి : ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని కాల రాస్తున్నాడని, ఫెడరల్ స్ఫూర్తి ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడన్నారు సీపీఎం నేత బీవీ రాఘవులు. మోదీ హయాంలో ప్రజాస్వామ్య విలువలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో.. హై౦దవ సంస్కృతిని అనుసరించే వారే ఈ దేశంలో ఉండాలన్న మహేష్ భగవత్ వ్యాఖ్యలు సరికావని ఆయన అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు రాఘవులు తెలిపారు.
సిటిజన్ అమైండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా ఓట్లేసిన టీఆర్ఎస్.. NRC బిల్లు పై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని రాఘవులు సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు. NRC పై బీజేపీ మిత్రపక్షాలన్నీ,YSRCP తో సహ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ విషయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.