
హైదరాబాద్: ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో నెలకొల్పింది. కొత్త కేంద్రాల మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు ఉంది. మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో కొత్తగా 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కంపెనీ స్థలాన్ని కొనుగోలు చేసింది.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం దీనిని నెలకొల్పుతున్నారు. 2024 అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 2024-–25లో మోల్డ్టెక్ రూ.7,5-80 కోట్ల మూలధనం ఖర్చు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.120 కోట్లు, 2022–-23లో రూ.148 కోట్లు వెచ్చించింది. కొత్త ప్లాంట్ల చేరికతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిమాణంలో 15–-18 శాతం వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. 2023–-24లో సంస్థ క్లయింట్ల జాబితాలో పతంజలి, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా చేరాయి. తాజా విస్తరణతో 2024-–25లో సంస్థ మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54 వేల మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు.