
మియాపూర్, వెలుగు: మానసికంగా ఇబ్బంది పడుతున్న ఓ యువతి అధిక మోతాదులో టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బీడీఎల్లో ఉద్యోగం చేస్తున్న కె. విజయలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మియాపూర్ దీప్తిశ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది. రెండేండ్లుగా విజయలక్ష్మి రెండో కుమార్తె వైశాలి(27) మానసిక సమస్యతో ఇబ్బంది పడుతోంది.
బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన విజయలక్ష్మి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది. డోర్లోపలి నుంచి లాక్ చేసి ఉండడం, ఎంత పిలిచినా కుమార్తె డోర్తీయకపోవడంతో తన వద్ద ఉన్న మరో తాళం చెవితో డోర్ఓపెన్చేసి లోపలికి వెళ్లింది. బెడ్రూంలో వైశాలి అపస్మారకస్థితిలో ఉండడం, పక్కనే టాబ్లెట్ స్ట్రిప్ కన్పించడంతో హుటాహుటిన సమీప హాస్పిటల్కు తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంతకాలంగా వైశాలి మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఈ క్రమంలోనే టాబ్లెట్లను ఎక్కువగా వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైశాలి ఆత్మహత్యకు ముందు సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.
‘అమ్మ, అక్క నన్ను క్షమించండి.. నా మానసిక పరిస్థితి బాగలేక, మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నా. అనుకున్నది సాధించలేకపోతున్నా’ అని నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు.