చెన్నై: ఒక వైపు పోలింగ్ జరుగుతుంటే.. ఓట్లు వేసేందుకు వస్తున్న జనాలకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు టోకెన్ల రూపంలో డబ్బులు విచ్చలివిడిగా డబ్బులు పంచుతున్నారని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఆరోపించారు. తాను పోటీ చేస్తున్న దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలసి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతోపాటు తన పెద్ద కుమార్తె, సినీ నటి శృతిహాసన్ తో కలసి ఆయన ఎన్నికల అధికారిని కలిశారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి తరపు నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని, పోలీసుల తనిఖీల్లో పట్టుపడతామేమోనని ముందు జాగ్రత్తగా టోకెన్లు రూపంలో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సేకరించిన కొన్ని టోకెన్లను ఎన్నికల అధికారికి ఆయన చూపించారు. పోలింగ్ అయిపోయాక తమ వద్దకు వస్తే డబ్బులు ఇస్తామని.. చెబుతున్నారని కమల్ హాసన్ ఫిర్యాదు చేశారు. రెండు మూడు వీధులకు ఒకరిద్దరు కలసి ఓటర్ల వద్దకు వెళ్లి టోకెన్లు పంచుతున్నారని.. పోలీసుల తనిఖీలను బట్టి వారు రకరకాలుగా డబ్బులు వెదజల్లుతున్నారని కమల హాసన్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలను చూపి తాను ఆందోళన నిర్వహించే ఉద్దేశం లేదని.. అలాగే పోలింగ్ ఆపేయమని కోరబోనని చెప్పారు. వాస్తవ పరిస్థితులను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడమే తన ఉద్దేశమని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా.. స్వేచ్ఛగా జరపాలని కోరుకుంటున్నానని కమల్ హాసన్ చెప్పారు. తండ్రికి మద్దతుగా వచ్చిన శృతి హాసన్ మాట్లాడుతూ.. తన తండ్రి పై నమ్మకంతో అభిమానులు, జనం తమ పార్టీని గెలిపిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. పోలింగ్ సందర్భంగా కమల్ కు తోడుగా వచ్చిన శృతి హాసన్ ను చూసేందుకు పలు పోలింగ్ కేంద్రాల సమీపంలో అభిమానులు ఎగబడడంతో వారిని నివారించేందుకు పలుచోట్ల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
టోకెన్ల రూపంలో డబ్బులు పంచుతున్నారు.. ఈసీకి కమల్ హాసన్ ఫిర్యాదు
- దేశం
- April 6, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు