అమెరికాలో 40 మంది కి పైగా ఇండియన్స్ మృతి

అమెరికాలో 40 మంది కి పైగా ఇండియన్స్ మృతి

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా ఎఫెక్ట్ తో అక్కడున్న ఇండియన్స్ వణికిపోతున్నారు. ఈ మహమ్మరి కారణంగా ఇప్పటికే 40 మందికి పైగా ఇండియన్స్ చనిపోయారు. 1500 మందికి పైగా ఇండియన్స్ కు కరోనా సోకింది. దీంతో ఇండియన్ కమ్యూనిటీ లో భయం నెలకొంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక్కడే ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. కేరళకు చెందిన వారు 17 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్ కు చెందిన 10 మంది, పంజాబ్ నుంచి 4, ఏపీ నుంచి 2 , ఒడిశాకు చెందిన ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా వారంతా 60 ఏళ్లకు పై బడిన వారే. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని న్యూజెర్సీని ఓక్ ట్రీ రోడ్ లో ఉండే ఇండియన్ భవేష్ దేవ్ తెలిపారు. ఓక్ ట్రీ రోడ్ ఇండియన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. కరోనా తో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అంత్యక్రియలకు 10 మందికి మించి అక్కడి ప్రభుత్వం అనుమతించటం లేదు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఇండియాలో బంధువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. న్యూ యార్క్, న్యూ జెర్సీలోనే 30 మంది వరకు ఇండియన్స్ చనిపోయారు. బాధితులకు ట్రీట్ మెంట్ కోసం అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్ ప్లాస్మా డోనర్స్ కోసం సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్లాస్మా ట్రీట్ మెంట్ కరోనా నివారణకు ఉపయోగపడుతుండటంతో మన వారిని రక్షించేందుకు అక్కడి ఇండియన్స్ ప్రయత్నం చేస్తున్నారు.