- కొనసాగుతున్న స్ర్కూటిని ప్రాసెస్
హైదరాబాద్, వెలుగు : స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో డిప్యూటేషన్ల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. మొత్తం 28 పోస్టులకు ఏకంగా 500లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. గతనెల 11 నుంచి 18 వరకు అప్లికేషన్ల ప్రక్రియ నిర్వహించారు.
ఆయా పోస్టులకు సర్కారు స్కూళ్లతోపాటు వివిధ సొసైటీల పరిధిలోని గురుకుల టీచర్లూ దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్ర్కూటిని ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే డీఈవోలతో క్రాస్ వెరిఫై చేయించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అధికారులు త్వరలోనే షార్ట్ లిస్టు తయారు చేయనున్నారు.