
విజయవాడ మీదుగా వెళ్లే ప్రయాణికులకు ఇది ఇంపార్టెంట్ న్యూస్. విజయవాడ రైల్వే డివిజన్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నాన్-ఇంటర్ లాకింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్న క్రమంలో పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల ప్రభావంతో దీంతో జూలై, ఆగస్టు నెలల్లో 100కు పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు, దారి మళ్లిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు.
జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకూ నాన్-ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగనున్నాయి. ఈ టైమ్ లో మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేశారు. అదనంగా 50 రైళ్లను ఇతర మార్గాలకు మళ్లించగా, మరికొన్నింటి టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు.
రద్దయిన రైళ్లు:
జూలై 23 నుంచి 29 వరకు, ఆగస్టు 6 నుంచి 24 వరకు ఈ కింది రైళ్లు రద్దయ్యాయి:
విజయవాడ నుంచి: ఒంగోలు, తెనాలి, బిట్రగుంట, గుంటూరు, రేపల్లె-తెనాలి, గూడూరు, రేపల్లె-మార్కాపురం రోడ్డు
ఇతర ప్రధాన మార్గాల్లో:
- సికింద్రాబాద్-గూడూరు
- తిరుపతి-లింగంపల్లి
- లింగంపల్లి-తిరుపతి
- నరసాపురం-ధర్మవరం
- రేణిగుంట-కాకినాడ
- విశాఖపట్నం-తిరుపతి
- జల్నా-తిరుపతి
- చర్లపల్లి-తిరుపతి
- యస్వంత్పూర్-తుగ్లకాబాద్
- రోయాపురం-పటేల్ నగర్
పాక్షికంగా రద్దయిన రైళ్లు, తాత్కాలిక మార్పులు:
- కాచిగూడ-రేపల్లె
- చర్లపల్లి-రేపల్లె
- రేపల్లె-సికింద్రాబాద్
- రేపల్లె-వికారాబాద్
దారి మళ్లించిన రైళ్లు (22–29 జూలై):
- షాలిమార్-చెన్నై
- హౌరా-బెంగళూరు
- నిజాముద్దీన్-ఎర్నాకుళం
- జోధ్పూర్-చెన్నై
- అయోధ్య-రామేశ్వరం
- ఖరగ్పూర్-విల్లుపురం
- సంత్రగచ్చి-మంగళూరు
- పురూలియా-తిరునల్వేలి
- గయా-చెన్నై
- అగర్తల-బెంగళూరు
- హౌరా-తిరుపతి
- మధురై-చండీగఢ్
- తిరుపతి-భువనేశ్వర్
- ధన్బాద్-అలప్పుజా
- గోరఖ్పూర్-కొచ్చువేలీ
సమయాల్లో మార్పు :
- 15 రైళ్లకు సమయాల్లో మార్పు
- 4 రైళ్లను రీషెడ్యూల్ చేశారు
ప్రయాణికులకు సూచనలు:
రైల్వే అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తూ, ఈ మార్పులను తప్పనిసరిగా గమనించాలని సూచించారు:
పయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణ వివరాలు వెబ్సైట్ లేదా రైల్వే హెల్ప్లైన్ ద్వారా చెక్ చేసుకోవాలని చెప్పారు.
మరింత సమాచారం కోసం https://www.indianrail.gov.in లేదా NTES యాప్ ఉపయోగించవచ్చు.