ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి

నారాయణ పేట జిల్లా బోయినపల్లి  గ్రామంలో  తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు సహా ఓ తల్లి మృతి చెందారు. ఏప్రిల్ 18న ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లారు. చెరువులో మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడే ప్రయత్నంలో  తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సురేఖ కొడుకు విజయ్(11), సురేఖ అక్క కూతురు లికిత(10),  వెంకటేశ్ (11)గా గుర్తించారు.

ఈ ఘటనను  అదే గ్రామానికి చెందిన  మమత అనే అమ్మాయి చూసి ఊళ్ళో వారికి సమాచారం అందించింది. చిన్నారులంతా పదేళ్ల లోపు వయసు గల వారు కావడంతో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.