ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య తన కుటుంబ సభ్యులతో జీవనోపాధి కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని విద్యుత్ నగర్ కాలసీలో నాలుగు రోజు నుంచి  నివాసముంటున్నాడు. కూలీ పనుల కోసం వలస వచ్చిన యేసయ్య అతని భార్య, ఇద్దరు కూమారులతో జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారులు ఇద్దరు అభిలేష్, పృథ్వీని స్థానిక పాఠశాలలో చేర్పించారు. శనివారం(జూన్ 17) స్కూల్ కు వెళ్లిన కుమారులను తల్లి యశోద తీసుకురావడానికి వెళ్లింది. అయితే రాత్రి అయినా భార్య, పిల్లలు ఇంటికి రాకపోవడంతో.. చుట్టు పక్కలా వెతికినా లాభం లేకుండా పోయిందని యేసయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. తన భార్య, కుమారుల ఆచూకీ కనిపెట్టాలని  కొల్లూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులను కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.