
మళప్పురం: తన కొడుకు పదో క్లాస్లో ఉన్నప్పుడు ప్రోత్సహించేందుకు పుస్తకాలు పట్టిన తల్లి..తాను కూడా సర్కార్ కొలువు సాధించింది. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న కేరళలోని మళప్పురానికి చెందిన బిందు తొమ్మిదేండ్ల పాటు చదివి తన కొడుకుతో పాటు ప్రభుత్వ జాబ్ కొట్టింది. 42 ఏండ్ల వయసున్న బిందుకు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ ఎగ్జామ్లో 92వ ర్యాంకు రాగా, ఆమె 24 ఏండ్ల కొడుకు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎగ్జామ్లో 38వ ర్యాంక్ సాధించాడు.
దీంతో ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. అయితే తనకు ఈ అవకాశం అంత ఈజీగా ఏమీరాలేదని బిందు మీడియాతో చెప్పుకొచ్చింది. కొడుకుతో పాటు తాను కోచింగ్కు వెళ్లానని తెలిపింది. నాలుగో అటెంప్ట్లో ఉద్యోగం సాధించానని వివరించింది. తన టార్గెట్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్ట్ అని బిందు చెప్తోంది.