కూతురు,కొడుకు గొంతుకోసి.. తానూ గొంతుకోసుకున్న తల్లి

కూతురు,కొడుకు గొంతుకోసి.. తానూ గొంతుకోసుకున్న తల్లి

చిత్తూరు జిల్లా వి. కోటలో దారుణం జరిగింది. కూతరు, కొడుకు గొంతుకోసి ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన వి. కోట మండలం కొంగాటం పంచాయితీలోని అట్రపల్లె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆనంద్, మీనాలు భార్యభర్తలు. వీరికి మీనాక్షి, మనోజ్ల అని ఇద్దరు సంతానం. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కూడా దంపతులు గొడవపడ్డారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన మీనా.. కూతురు మీనాక్షి, కొడుకు మనోజ్లల గొంతుకోసి.. ఆమె కూడా గొంతుకోసుకుంది. గమనించిన స్థానికులు.. వెంటనే ముగ్గురిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గ్రామస్థులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆనంద్‌ను విచారిస్తున్నారు.